ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అనారోగ్యం ఏర్పడితే.. ఏ పని చేయాలన్నా.. చేయడానికి శరీరం సహకరించదు. జ్వరం, జలుబు, దగ్గు లాంటివి వస్తే సమీపంలోని ఆర్ఎంపీని సంప్రదించే వారు చాలా మంది ఉంటారు. ఇంకా వ్యాధి తీవ్రతరం అయితే.. సిటీకి వెళ్లి ఆసుపత్రుల్లో చూపించుకుంటారు. కానీ అక్కడి వైద్యులు.. నిజంగా ఎంబీబీఎస్ చేశారా లేదా అనేది ఎవరూ ఆలోచించరు. చాలా మందికి అంత సమయం కూడా ఉండదు. దీనినే నకిలీగాళ్లు అవకాశంగా తీసుకొని.. వైద్య అవతరం ఎత్తుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.