కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పెండేగల్లులో ఓ మహిళా కూలీకి అదృష్టం వరించింది. పొలం పనులు చేస్తుండగా ఆమెకు 15 క్యారెట్ల వజ్రం లభ్యమైంది. మట్టిలో మెరుస్తూ కనిపించిన ఈ రాయి వజ్రంగా తేలడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. దీని విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.