జైలు నుంచి విడుదలైన తర్వాత కొన్ని నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఎమ్మెల్సీ కవిత మళ్లీ పాలిటిక్స్లో యాక్టివ్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన పకడ్బందీగా నిర్వహించి చిత్తశుద్ది నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కాగా, మరికొన్ని రోజుల్లో కవిత క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకు వెళ్లే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది.