వైసీపీ అధినేత జగన్ పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించారు. పార్టీలోని సీనియర్ నేతలకు ఈ బాధ్యతలు అప్పగించారు. జనసేన నుంచి వైసీపీలో చేరిన పోతిన మహేష్కు గుంటూరు పార్లమెంట్ బాధ్యతలు కట్టబెట్టడం విశేషం. రానున్న రోజుల్లో వైసీపీలో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ నియామకాలు వైసీపీకి రాజకీయంగా ఎంతవరకు ఉపయోగపడతాయో వేచి చూడాల్సి ఉంది.