తెలంగాణలో పోలీసులకు డీజీపీ శుభవార్త చెప్పారు. నిత్యం సమాజంలో నేరాలు జరగకుండా చూసే పోలీసులకు.. బర్త్డే, మ్యారేజ్డేలకు ప్రత్యేక సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. విధి నిర్వహణలో పోలీసులు కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నారని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అదే సమయంలో రాష్ట్రంలో ఒకేసారి 22 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. వీటికి సంబంధించి డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.