పోసాని అస్వస్థత వ్యవహారంలో ట్విస్ట్.. అంతా నాటకమన్న పోలీసులు..!

1 year ago 18
సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అస్వస్థత వ్యవహారం మరో మలుపు తిరిగింది. కడప రిమ్స్ ఆస్పత్రిలో పోసాని కృష్ణ మురళికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. పోసానికి అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే పరీక్షలలో పోసానికి ఎలాంటి అనారోగ్యం లేదని తేలిందని రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పోసాని కృష్ణ మురళి ఉదయం నుంచి అనారోగ్యం అంటూ నాటకం ఆడారని రైల్వే కోడూరు సీఐ వెల్లడించారు. ఛాతీలో నొప్పి అంటే ఆస్పత్రికి తరలించామని.. రాజంపేట, కడప ఆస్పత్రులలో అన్నిరకాల పరీక్షలు చేయించామని తెలిపారు. ఈ టెస్టులలో పోసానికి ఎలాంటి సమస్యలు లేవని తేలిందని.. దీంతో రాజంపేట సబ్ జైలుకు తిరిగి తరలిస్తున్నట్లు వెల్లడించారు.
Read Entire Article