సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి బెయిల్ లభించింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కడప మొబైల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అలాగే పోసాని కృష్ణ మురళిని కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను కడప మొబైల్ కోర్టు డిస్మిస్ చేసింది. జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లె పోలీసులు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.