Posani Krishna Murali Bail: నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. ఆయనకు మంగళవారం కర్నూలు జేఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. పోసానిపై 2024, నవంబర్ 14వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోని త్రీ టౌన్లో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోసాని మార్చి 5వ తేదీ నుంచి పోసాని కర్నూలు జైలులో ఉన్నారు. ఆయనకు పలు కేసుల్లో బెయిల్ రావడంతో ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యకూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూషించిన కేసులో పోసాని అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.