హిందూ దేవాలయాలకు సంబంధించిన నిధులను హిందూ ఆలయాల పరిరక్షణకు మాత్రమే ఉపయోగిస్తామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. హిందూ ధర్మశాస్త్రాలు, పురాణాలలో షిరిడీ సాయి లేరని స్పష్టం చేశారు. హిందువులతో పాటుగా ఇతర మతాల్లోనూ షిరిడీ సాయికి భక్తులు ఉన్నారని.. సాయి ఆలయాల అభివృద్ధి కోసం సహకారం అందించేందుకు చాలా మంది ఉన్నారని అభిప్రాయపడ్డారు.