ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం చోటుచేసుకుంది. సాయికుమార్ అనే 60 ఏళ్ల వృద్ధుడు ఆస్పత్రి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయికుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, దేవుడు పిలుస్తున్నాడని తోటి రోగులతో చెప్పేవాడు. మంగళవారం ఉదయం ఆస్పత్రి భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.