Prakasam Barrage Flood Water: ఏపీలో భారీ వర్షాలు కొనసాగుతుండటంతో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగింది. అధికారులు 69 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, విజయవాడలో రోడ్లు నదుల్లా మారాయి. ఏలూరు జిల్లాలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు, గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో ప్రజలను అప్రమత్తం చేశారు.