నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నియోజకవర్గానికి రాకపోయినా, సోషల్ మీడియా ద్వారా తన ప్రచారం బలంగా ప్రజల్లోకి వెళుతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని అసమర్థుడిగా విమర్శించిన అర్వింద్.. రేవంత్ రెడ్డి కేసీఆర్తో ములాఖత్ అయ్యారని ఆరోపించారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వంటి కేసులలో రేవంత్ సర్కారు ముందుకు వెళ్లలేకపోతోందని దుమ్మెత్తిపోశారు. నిజామాబాద్లో బీజేపీ బలంగా ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.