సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి దిగిన ఓ అభ్యర్థి.. ప్రచారం చేసేందుకు, ఓటర్లకు పంచేందుకు డబ్బులు లేక ఇటీవలె ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తాజాగా జరిగిన ఈ ఎన్నికల్లో ఆ అభ్యర్థి ఘన విజయం సాధించడం గమనార్హం. డబ్బులు లేక బలవన్మరణానికి పాల్పడ్డ ఆ అభ్యర్థిని గ్రామస్థులంతా ఓటు వేసి గెలిపించారు. దీంతో ఈ ఎన్నిక.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆసక్తికరంగా మారింది.