ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు ప్రజల సమస్యల పరిష్కారానికి వినూత్నంగా క్యూఆర్ కోడ్ ఆధారిత ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించారు. ఇకపై ప్రజలు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. ఈ పోర్టల్ ద్వారా పేరు, గ్రామం, సమస్య వివరాలతో పాటు అవసరమైన పత్రాలను కూడా అప్లోడ్ చేయవచ్చు. దరఖాస్తులను పర్యవేక్షించేందుకు 24 మందితో కూడిన కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు.