సాధారణంగా.. ఒక హీరో సినిమా ఫంక్షన్లో మరో హీరో గురించి అరుపులు కేకలు వినపడటం సహజంగానే చూస్తుంటాం. అయితే.. ఈ సంప్రదాయం రాజకీయ సభల్లోకి కూడా వచ్చేసింది. తాజాగా.. బాపట్ల జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు ప్రజావేదిక సభలో మాట్లాడుతుండగా.. ఓ కుర్రాడు జై జగన్ నినాదాలు చేశాడు. దానికి సీఎం చంద్రబాబు చాలా జాగ్రత్తగా రియాక్టయ్యారు. ఒక్క క్షణం ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఆ వెంటనే తన స్థిత ప్రజ్ఞతతో వ్వవహరించారు.