ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం పర్యటనలో భద్రతా వైఫల్యం కలకలం రేపుతోంది. ప్రధాని భద్రతా వలయంలోకి అనధికార వ్యక్తులు ప్రవేశించారని వార్తలు వస్తున్నాయి. వీఐపీ పాస్లను ట్యాంపరింగ్ చేసి ఇద్దరు వ్యక్తులు ప్రధానికి దగ్గరగా వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తవుతున్నాయి. దీనిపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా పోలీసులు వివరాలు వెల్లడించలేదు. కాగా, గతంలోనూ ప్రధాని పర్యటనల్లో ఇలాంటి భద్రతా లోపాలు జరిగాయి. పంజాబ్లో ఓ ఫ్లైఓవర్పై దాదాపు 20 నిమిషాలు ఆగాల్సి వచ్చింది.