Chandrababu Narendra Modi meeting: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీకి సంబంధించి పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అలాగే రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి చంద్రబాబు.. మోదీని ఆహ్వానించారు. మే 2వ తేదీన జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. మరోవైపు ప్రధాని మోదీ ఏపీ పర్యటన కోసం ఇప్పటికే అమరావతిలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే.