Harshitha Manikanta mount Elbrus: ఏపీ పోలీసుల సత్తాను ఓ మహిళా డీఎస్పీ ప్రపంచ వేదికపై నిరూపించారు. ఐరోపాలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరాన్ని అధిరోహించారు. ఏపీలో డీఎస్పీగా పనిచేస్తున్న హర్షిత మణికంఠ.. మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు. ఈ విషయాన్ని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఏపీ పోలీసులకు హర్షిత మణికంఠ గర్వకారణంగా నిలిచారని కొనియాడారు.