తెలంగాణలో ఏసీబీ అధికారులమని చెప్పి కొందరు కేటుగాళ్లు ఎక్సైజ్ సిబ్బందిని మోసం చేసిన ఘటన ప్రస్తుతం హాట్ టాఫిక్గా మారింది. నకిలీ ఐడీలతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న కేటుగాళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, డబ్బులు అడిగితే 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు తాజాగా ప్రభుత్వ అధికారులు, ప్రజలకు సూచించారు.