ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం.. 18 రోజుల పసికందు ఎడమ చేయి తొలగింపు..!

1 week ago 5
ఖమ్మం ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. వైరా మండలానికి చెందిన రేణుక అనే మహిళకు పుట్టిన కవలల్లో ఒక శిశువు బరువు తక్కువగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇంక్యుబేటర్‌లో చేర్పించారు. అక్కడ వైద్య సిబ్బంది ఎడమ చేతికి క్యాన్యులా సరిగ్గా పెట్టకపోవడం, ఆపై నిర్లక్ష్యం చేయడంతో చేయి పూర్తిగా సెప్టిక్ అయ్యింది. చివరకు హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ ప్రాణాలకే ప్రమాదంగా మారడంతో పుట్టిన 18 రోజులకే ఆ పసికందు ఎడమ చేతిని తొలగించాల్సి వచ్చింది.
Read Entire Article