ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. త్వరలో డీఏ బకాయిలు, డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

3 months ago 19
తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఉద్యోగుల డీఏ బకాయిలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన మూడు డీఏలను సాధ్యమైనంత త్వరగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. నెలకు రూ.700 కోట్లు చొప్పున పాత బకాయిలు తీరుస్తున్నామని, ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి స్పష్టం చేశారు. అయితే పీఆర్‌సీ, డీఏ బకాయిలు చెల్లింపుల విషయంలో స్పష్టత లేదని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
Read Entire Article