Ap Govt Sc Employees Promotions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించి, 2025 ఏప్రిల్ 18 నుండి అమలులోకి వచ్చేలా సవరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-1, 2, 3 కేడర్లలో నిర్దిష్ట శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో పాటు, అర్హులు దొరకని ఖాళీలను తదుపరి సంవత్సరానికి బదిలీ చేస్తారు. మహిళలకు 33 1/3% సమాంతర రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి.