ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో పెండింగ్లో ఉన్న బిల్లుల బకాయిల కోసం రూ.720 కోట్లు విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధించి విడుదల చేసిన ఈ నిధులను నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు. సరెండర్ లీవులు, గ్రాట్యుటీ, జీపీఎఫ్ వంటి పెండింగ్ బిల్లులను ఒకేసారి క్లియర్ చేసింది ప్రభుత్వం. రేవంత్ సర్కార్ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోంది.