తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మహర్దశ పట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా మెుత్తం 24 కాలేజీలకు కొత్త భవనాలు నిర్మించనున్నారు. అందుకు రూ. 594 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలోనే ఎక్కువ కాలేజీలకు నిధులు వెచ్చించనున్నారు.