Nara Lokesh Praises Govt Teacher: ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో నమ్మకం పెంచేందుకు ఉపాధ్యాయుడు వాసుదేవరావు తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించారు. విజయనగరం జిల్లా రాజాం సమీపంలోని డోలపేటకు చెందిన ఆయన గడిముడిదాం పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె నాలుగో తరగతి, కుమారుడు రెండో తరగతి చదువుతున్నారు. మంత్రి నారా లోకేష్ సైతం వాసుదేవరావును ప్రశంసించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చదివించాలని ఆయన ఆకాంక్షించారు.