ప్రభుత్వ ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ త్వరలోనే గుడ్న్యూస్ చెప్పనుంది. 2 వేల మందికి పైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించే ప్రతిపాదనలను విద్యాశాఖ కార్యదర్శికి పంపారు. త్వరలోనే వాటికి ఆమోద ముద్ర పడి ప్రమోషన్లు దక్కనున్నాయి.