తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పోషకాహార లోపాన్ని నివారించడానికి ప్రభుత్వం రాగి జావ పంపిణీ చేయనుంది. శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. దీనికి ప్రభుత్వం రూ.14 కోట్లు కేటాయించింది. విద్యార్థులకు రాగి జావ అందించినందుకు వంట కార్మికులకు ప్రోత్సాహకంగా ఒక్క స్టూడెంట్కు రూ. 25 పైసలు ఇవ్వనున్నారు.