తెలంగాణ హైకోర్టు భూ హక్కులపై కీలక తీర్పునిచ్చింది. తహసీల్దార్కు భూమిపై టైటిల్ నిర్ణయించే అధికారముండదని స్పష్టం చేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అల్వాల్లోని 5 ఎకరాల తోళ్ల కార్ఖానా భూమిని ప్రభుత్వ స్థలంగా ప్రకటిస్తూ 2019లో తహసీల్దార్ జారీచేసిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. భూమిని కొనుగోలు చేసిన 40 మంది వేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం, రెవెన్యూ పత్రాలు హక్కును నిర్ణయించలేవని పేర్కొంది. అక్రమణలుంటే భూ దురాక్రమణ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవచ్చని తెలిపింది.