వాహనాలు తనిఖీ చేస్తున్న రవాణా శాఖ అధికారిని బొగ్గు టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 15 రోజుల క్రితమే ట్రాన్స్ఫర్ అయి వచ్చిన డీటీఓ వెంకన్న.. ఈ ప్రమాదంలో చనిపోవడం తీవ్రంగా కలిచి వేస్తోంది. శరీరంపై నుంచి లారీ దూసుకెళ్లడంతో.. అతడి శరీరం ఛిద్రమైంది. టిప్పర్ డ్రైవర్ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.