ఔటర్ రింగ్ రోడ్డులో భద్రతను మరింత బలపరచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే హెచ్ఎండీఏ విద్యుద్దీపాలు ఏర్పాటు చేసిన అండర్పాస్లలో ఇప్పుడు సీసీ కెమెరాలు అమర్చనుంది. మొదటి దశలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 66 అండర్పాస్లలో రూ.7.54 కోట్ల వ్యయంతో నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ చర్యతో రహదారి భద్రత, ట్రాఫిక్ పర్యవేక్షణ, నేర నియంత్రణలో మరింత పారదర్శకత వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.