ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విభేదాలతో రచ్చకెక్కిన విశాఖ ఆర్డీవో, డీఆర్వోలను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. తక్షణమే వీరిద్దరినీ రిలీవ్ చేయాలని విశాఖ కలెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆర్డీవో శ్రీలేఖ, డీఆర్వో భవానీ శంకర్లను ఆదేశించింది. మరోవైపు వీరిద్దరి స్థానంలో వేరేవారికి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం.. వీరికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు.