మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఢిల్లీకి 16 సార్లు వెళ్లినా ఫలితం లేదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఈ నెల 30న వైజాగ్ జనసేన సమావేశంలో స్టీల్ ప్లాంట్పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సింగపూర్ పర్యటన పెట్టుబడుల కోసమా లేక పెట్టుబడులు పెట్టడానికా అని ప్రశ్నించారు.