కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గొప్ప మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుడికి ఆయన వెంటనే ప్రథమ చికిత్స చేసి, తన కాన్వాయ్లోని కారులో అతడ్ని ఆసుపత్రికి తరలించి ప్రాణపాయం నుంచి రక్షించారు. ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల వద్ద జరిగిన ఓ ప్రమాదంలో, వెంకటేశ్వరరావు అనే వ్యక్తి లారీ ఢీకొనడంతో గాయపడగా, మంత్రి వెంటనే స్పందించి ఆదుకున్నారు.