సాఫ్ట్వేర్ ఉద్యోగుల పని ఒత్తిడి వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా లోక్సభలో తెలిపారు. హైదరాబాద్ ఐటీ ఉద్యోగులపై జరిపిన అధ్యయనంలో 84 శాతం మందికి ఫ్యాటీ లివర్, 71 శాతం మందికి ఊబకాయం ఉన్నట్లు తేలిందన్నారు. ఈ సమస్యలను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.