ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమ గాయకుడు అందెశ్రీ (64) కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఇంట్లో ఆకస్మాత్తుగా కుప్పకూలిన ఆయన్ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందారు. 'జయ జయహే తెలంగాణ' గీతంతో తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన అందెశ్రీ మృతితో సాహితీ లోకం తీరని లోటులో మునిగింది. సీఎం రేవంత్ రెడ్డి సహా.. పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.