సీటు కోసం తగాదా ఓ వ్యక్తిపై దాడి చేసే వరకూ వెళ్లింది. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. కాకినాడలో తుని నర్సీపట్నం ఆర్టీసీ బస్సులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తాము కర్చీఫ్ వేసిన సీట్లో కూర్చున్నాడంటూ ఓ వ్యక్తితో ఇద్దరు మహిళలు తగాదా పడ్డారు. మాటామాటా పెరగటంతో అతని జుట్టు పట్టుకుని లాగి.. ఆ ప్రయాణికుడిని మహిళలు చితకబాదారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.