టీజీఎస్ఆర్టీసీ హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్- విజయవాడ మార్గాల్లో బస్సు టికెట్ ధరలను 16% నుండి 30% వరకు తగ్గించింది. హైదరాబాద్-విజయవాడ గరుడ ప్లస్ ధర రూ.635 నుండి రూ.444కి, రాజధాని ఏసీ రూ.533 నుండి రూ.448కి తగ్గింది. హైదరాబాద్-బెంగళూరు సూపర్లగ్జరీ రూ.946 నుండి రూ.757కి, లహరి ఏసీ స్లీపర్ బెర్త్ రూ.1569 నుండి రూ.1177కి తగ్గించారు. ఈ రాయితీలు ఆన్లైన్, ఆఫ్లైన్ బుకింగ్లకు వర్తిస్తాయని.. ప్రయాణికులకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.