బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్లో బస్సు టికెట్ ధరలను తగ్గించింది. వేసవి కాలం రావడంతో.. ఏసీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచుకునేందుకు భారీగా రాయితీలను ప్రకటించింది. టికెట్ ధరపై రూ.5 నుంచి రూ.10 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఒకవైపు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఏసీ బస్సులు ఖాళీగా ప్రయాణిస్తుండటంతో ఆర్టీసీ టికెట్ ధరలను తగ్గించింది.