డిసెంబర్ నెల వచ్చేసింది.. ఇంకో 30 రోజులలో న్యూఇయర్ రాబోతోంది. న్యూఇయర్ రోజున ఇంట్లో కుటుంబసభ్యులతో గడపాలని కొందరు.. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని మరికొందరు ప్లాన్ చేస్తుంటారు. అలాగే ఊరెళ్లడానికి ఇప్పటికే బస్సులు, రైళ్లల్లో టికెట్లు బుక్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంటారు. అయితే అలాంటి వారికి గుడ్ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఇంద్ర ఏసీ బస్సు ఛార్జీలు తగ్గించారు. అయితే ఇది కేవలం శ్రీకాకుళం విజయవాడ మార్గంలో నడిచే ఇంద్ర ఏసీ బస్సులకు మాత్రమే వర్తిస్తుంది. డిసెంబర్ ఒకటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.