సిద్దిపేట జిల్లాలోనే కొమురవెల్లి మల్లన్న క్షేత్రం ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతీ సంవత్సరం పెద్ద ఎత్తున జాతరను నిర్వహిస్తారు. అది కూడా మూడు నెలల పాటు ఉంటుంది. ఈ సంవత్సరం సంక్రాంతి సమయంలో మొదలై ఉగాది వరకు నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే అక్కడకు వెళ్లాలంటే ప్రస్తుతం బస్సు కనెక్టివిటీ మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ఉన్నా.. నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఇక్కడ హాల్ట్ ఏర్పాటు చేయలేదు.