తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2026 ప్రకారం మాతాశిశు ఆరోగ్య సూచికల్లో రాష్ట్రం జాతీయ సగటు కంటే మెరుగైన ఫలితాలను సాధించింది. మాతృ మరణాల రేటు 43కు తగ్గగా.. సంస్థాగత ప్రసవాలు 99.9 శాతానికి చేరుకున్నాయి. 'ఆరోగ్య మహిళ' పథకం ద్వారా 28.3 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించడం, టిఫా స్కాన్ల వంటి ఆధునిక సౌకర్యాలు కల్పించడం వల్ల ఈ విజయం సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. గర్భిణీల పోషకాహారం, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అంటున్నారు.