Kanipakam Vinayaka Temple Prasad Scheme: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కాణిపాం వినాయకుడిని దర్శించుకున్నారు. ఆలయ వైభవాన్ని తెలుసుకుంటూ, ఆధ్యాత్మిక వాతావరణంలో కొంత సేపు సమయం గడిపారు. స్వామివారి దర్శనం తర్వాత పండితులు ఆశీర్వదించి.. స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు,జ్ఞాపిక అందించారు. అయితే కాణిపాకం ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రసాద్ పథకం పరిధిలోకి ఆలయాన్ని తీసుకెళ్లి నిధులు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ సహకారంతో ఏపీ దూసుకెళుతోందన్నారు.