శనివారం పూట ఇంట్లో చికెన్ తినొద్దు అని తమ్ముడిపై అన్న ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకున్న తమ్ముడు ఆదివారం పూట అన్న నిద్రిస్తుండగా గొడ్డలితో తలపై నరికి చంపేశాడు. ఈ దారుణ ఘటన వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో చోటుచేసుకుంది. ఇద్దరికీ వివాహం కాగా.. మద్యానికి బానిస కావడంతో భార్య, పిల్లలు వదిలేసి వెళ్లిపోయారు. తల్లి వద్దే ఉంటున్న అన్నదమ్ములు చికెన్ పకోడి విషయంలో గొడవ పడి ప్రాణాలు పోయేవరకూ తెచ్చుకున్నారు.