ప్రిన్సిపల్ వేధింపులు.. కలెక్టరేట్‌ వరకు 18 కి.మీ విద్యార్థుల పాదయాత్ర

1 year ago 24
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లిలోని ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు 200 మంది ఆందోళన బాట పట్టారు. ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌ తమను వేధిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సంతోష్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారు మంగళవారం పాఠశాల, కళాశాల ప్రహరీ దూకి కాలినడకన బీచుపల్లి నుంచి గద్వాలలోని కలెక్టరేట్‌కి 18 కి.మీ. పాదయాత్ర ద్వారా చేరుకుని సమస్యలు విన్నవించుకున్నారు.
Read Entire Article