ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. తనను ఎమ్మెల్యేగా, ఉపముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం వల్ల పిఠాపురాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే కృషి చేస్తున్నానని పవన్ కళ్యాణ్ వివరించారు. తాను చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను లేఖలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.