మెదక్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం పెట్టుకొని ఆ భార్య కట్టుకున్న భర్తనే కడతేర్చింజి. ప్రియుడితో కలిసి సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. అనంతరం ఏం తెలియనట్లు నాటకం ఆడింది. తన భర్త కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. భార్యను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.