రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం నచ్చని తమ్ముడు, కన్న అక్కను దారుణంగా హత్య చేశాడు. పెంజర్లకు చెందిన రుచిత అనే యువతిని ఆమె సోదరుడు రోహిత్, దినేష్ అనే వ్యక్తితో మాట్లాడటం నచ్చక గొంతుకు వైరు బిగించి చంపేశాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశాడు. పరారీలో ఉన్న రోహిత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రోహిత్ నిజం అంగీకరించడంతో.. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.