ప్రేమ పేరుతో బాలికను లొంగదీసుకున్న ఓ ఉపాధ్యాయుడికి విశాఖ పోక్సో కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. 2015లో ఈ ఘటన జరిగింది. అప్పట్లో బాలికతో కలిసి రాజస్థాన్ వెళ్లిపోయిన తిరుపతిరావును.. 2021లో పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికి వీరికి ఇద్దరు పిల్లలు. ఈ కేసును విచారించిన పోక్సో న్యాయస్థానం నేరం రుజువు కావటంతో తిరుపతిరావుకు జైలు శిక్షతో పాటుగా 71 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పును ఇచ్చింది.