అదనపు కట్నం కోసం భర్త వేధింపులతో విసిగిపోయిన వివాహిత.. కుమారుడిని చంపి.. తానూ ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహం వద్ద తొమ్మిది పేజీల సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ.. అదనపు కట్నం కోసం భర్త వేధించేవాడని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి అతడి బంధువులు కూడా తోడయ్యారని తెలిపింది. అయితే కట్నం కోసం మరో పెళ్లి చేసుకోవడానికి తమ అల్లుడు సిద్ధమయ్యాడని మహిళ తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో మనస్తాపానికి గురై తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని చెప్పారు.