తెనాలిలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. తెనాలికి చెందిన ముగ్గురు యువకులు డ్రగ్స్ కోసం బెంగళూరు వ్యక్తికి డబ్బులు ఆన్లైన్ ద్వారా పంపించారు. దీంతో బెంగళూరు వ్యక్తి ఓ ప్రైవేట్ బస్సులో పార్శిల్ ద్వారా డ్రగ్స్ పంపించారు. అయితే ఈ సమాచారం పోలీసులకు అందింది. దీంతో మాటు వేసిన పోలీసులు.. ముగ్గురు యువకులకు పార్శిల్ అందిస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పార్శిల్లో 5 గ్రాముల ఎండీఎంఏ ఉన్నట్లు గుర్తించారు.